మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇలా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో ఒకటి బోలా శంకర్,  ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు,  ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది,  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెలుగా కీర్తిసురేష్ నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ తాజాగా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది, రామోజీ ఫిల్మ్ సిటీ లో 12 రోజుల పాటు ఈ సినిమా టాకీ ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, కీర్తి సురేష్ తో పాటు పలువురు నటీనటులు కూడా పాల్గొన్నబోతున్నట్లు తెలుస్తోంది, ప్రస్తుతం కాఫీ షాప్ నేపథ్యంలో కొన్ని సీన్స్ లను చిత్ర బృందం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవిసినిమా తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు, ఈ  సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు,  అలాగే చిరంజీవి ఈ సినిమాలతో పాటు గాడ్ ఫాదర్ సినిమా లో కూడా హీరోగా నటిస్తున్నాడు, అలాగే బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు, వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి, వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: