సూపర్ స్టార్ మహేష్ బాబు స్ట్రాటజీ ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన హీరోగా సెట్స్ పైన ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. సర్కారు వారి పాట చిత్రాన్ని పూర్తి చేసిన మహేష్ బాబు మిగతా షూటింగ్ ను కూడా త్వరలోనే పూర్తి చేసుకున్నాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ నటించగా ఈ చిత్రం వాయిదా పడుతున్న కొద్దీ భారీ స్థాయిలో ఇమేజ్ తగ్గి పోతుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తొందరగా విడుదల చేస్తే మంచిదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదల అయింది. భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా పై అంచనాలు కూడా అదేవిధంగా పెరిగాయి.

ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. తన 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాలని చెప్పి దర్శకుడు త్రివిక్రమ్ అద్భుతమైన స్టోరీ రాయాలని సూచించారు. ఆ విధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మంచి స్టోరీ ని మహేష్ బాబు కు రెడీ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి కాగా తొందరలోనే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ఈచిత్రాన్ని చేయనున్నారట చిత్రబృందం.

ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన విడుదలను ఫిక్స్ చేసి మహేష్ తన ఎవరికీ అర్థం కాని స్ట్రాటజీని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. సర్కారు వారి పాట చిత్రాన్ని ఇంకా విడుదల చేయలేదు షూటింగ్ చేయని తన 28వ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం పట్ల కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినిమా ప్రేక్షకులు. త్రివిక్రమ్ అతి తక్కువ సమయంలోనే సినిమా చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మహేష్ బాబు స్ట్రాటజీ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన షూటింగ్ మధ్యలో విదేశాలకు వెళ్ళి పోతూ ఉంటారు. అలాంటి సమయాలలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడమే మంచిది అని కొంతమంది చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: