ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు సరోగసీ ద్వారా పిల్లలను కనడానికి ఇష్టపడుతున్నారు..ముఖ్యంగా మంచు లక్ష్మి మొదలుకొని తాజాగా ప్రియాంక చోప్రా వరకు ఇలా చాలా మంది సరోగసి ద్వారా పిల్లలను కనడం గమనార్హం.. ఇక రిలయన్స్ అధినేత అంబానీ భార్య నేహా అంబానీ కూడా సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరొక ప్రముఖ హీరోయిన్ ప్రీతి జింటా కూడా ఈ సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది..


ఇదిలా ఉండగా ఈమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి జింటా ఆ తర్వాత తెలుగు, ఇంగ్లీష్, పంజాబీ వంటి భాషా చిత్రాలలో కూడా నటించింది. ఇక ఈమె క్రిమినల్ సైకాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత 1998లో దిల్ సే అనే సినిమా ద్వారా హిందీ అరంగేట్రం చేసింది. ఇక దిల్ సే సినిమాకు ఈమెకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. 2000 సంవత్సరంలో క్యా కేహనా  ఈ సినిమాలో కూడా విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇక తెలుగులో కూడా వెంకటేశ్ సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది.

ఇకపోతే షూటింగ్ లేనప్పుడు ఎక్కువగా తన సొంత ఊరు అయినటువంటి సిమ్లా ల్లోనే ఎక్కువగా గడిపేది. ఇక తర్వాత 2006లో కుటుంబంతో సహా ముంబైకి మకాం మార్చిన ప్రీతిజింటా.. 2004లో కొలంబోలో ఒక కచేరీ సమయంలో పేలుడు జరిగి నప్పుడు ఆ ప్రమాదం నుంచి అలాగే హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం సమయంలో కూడా ఇలా రెండుసార్లు  చావు నుంచి తప్పించుకుంది. ఇకపోతే 2016లో ఫిబ్రవరి 29వ తేదీన లాస్ ఏంజిల్స్ లో  జీన్ గూడెనఫ్ ను వివాహం చేసుకుంది.  ఇక ఇతను ప్రస్తుతం అమెరికాకు చెందిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సంస్థలో ఫినాన్స్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: