సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత గీత గోవిందం ఫెమ్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి  జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించి ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, అయితే ఈ సినిమా విడుదల తేదీకి కాస్త సమయం దొరకడంతో మహేష్ బాబు 'సర్కారు వారి పాట'  సినిమా విషయంలో కొత్త ప్రణాళికలను రాచిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సౌత్ నుండి నార్త్ కు వెళ్లే సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది, అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నార్త్ వైపు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది, సర్కారు వారి పాట సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది, ఇలా మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాతో నార్త్ పై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు,  ఈ సినిమా తర్వాత మహేష్ బాబు,  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: