టాలీవుడ్ సినిమా పరిశ్రమలో యాక్షన్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు హీరో గోపీచంద్. ఆయన తన కెరియర్ లో ఎన్నో మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను ఇప్పటివరకు అలరిస్తూ వచ్చాడు. అలా తన మేనరిజంతో తన నటనతో తన స్టైల్ తో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా చేసుకున్నాడు. అయితే తొలుత సినిమా పరిశ్రమలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న గోపీచంద్ ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసి ఇప్పుడు స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు.

అయితే ఆయన హీరోగా చేసినప్పటికంటే విలన్ గా చేసినప్పుడే ఎక్కువ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు అని చెప్పవచ్చు. ప్రభాస్ వర్షం సినిమా మహేష్ బాబు నిజం సినిమా లో ఆయన పండించిన విలనిజానికి ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఆ విధంగా గోపీచంద్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది యజ్ఞం సినిమా. ఆ చిత్రంలో ఆయన హీరోగా చేసి భారీ స్థాయిలో హిట్ అందుకుని ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఇక ఆ తర్వాత ఆయనకు విలన్ గా చేసే అవకాశం రాలేదనే చెప్పాలి. ఆయనకు హిట్స్ కూడా తోడవడంతో ఆయన హీరోగా ఇప్పటి వరకు కొనసాగుతూ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.

అయితే మరొక సారి గోపీచంద్ ను విలన్ గా నటించిన చేయాలనే ఆలోచన చేస్తున్నాడు రాజమౌళి. ఆయన ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన రాజమౌళి తను విలన్ గా చేస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచన చేశాడట. త్వరలోనే తన పాత్ర గురించి వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. మరి విలన్ వా చేయడానికి ఎక్కువగా మక్కువ చూపని గోపీచంద్ రాజమౌళితో మహేష్ సరసన విలన్ గా నటించడం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే చాలామంది రాజమౌళి సినిమా చేస్తే బాగుంటుంది అని గోపీచంద్ కు సలహా ఇస్తున్నారు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: