బాహుబలి సినిమా తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ఇక బాహుబలి తర్వాత ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో 'సాహో' సినిమా చేసి తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు యూనివర్సల్ స్టార్ గా మారేందుకు వరుస ప్రాజెక్టులు లైన్ లో పెట్టాడు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్టు కె వంటి సినిమాలన్నీ కూడా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.ఇక వీటిలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఓమ్ రావుత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదల కోసం చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఇంగ్లీష్ భాష తో సహా 9 భాషలలు మరియు ఏకంగా 30 వేల థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట. ఒకవేళ ఇదే కనుక జరిగితే హాలీవుడ్ హీరోల రికార్డులను ప్రభాస్ బద్దలు కొట్టడం ఖాయమని చెప్పవచ్చు. అంతేకాదు ఇండియాలో ఏ స్టార్ హీరో ఇప్పటివరకు సాధించని.. ఇకపై సాధించబోని రికార్డుని ప్రభాస్ ఈ సినిమాతో సృష్టించబోతున్నారు. ఇక మన ఇండియన్ సినిమాలు చాలా వరకు ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యాయి. కానీ ఒక ఇంగ్లీషులో మాత్రం డైరెక్టర్ రిలీజ్ అవ్వలేదు.
 

అయితే ప్రభాస్ మాత్రం ఆ వెలితిని కూడా తీర్చేయబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ వార్త విని ఫాన్స్ సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇండియన్ హిస్టరీ లోనే అత్యధికంగా విజువల్ ఎఫెక్ట్ ని ఉపయోగించిన సినిమాగా ఆదిపురుష్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఏకంగా 8 వేలకు పైగా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ వున్నాయట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా.. అతని సరసన సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్  కనిపించనుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: