దేవరకొండ బ్రదర్స్ కు టాలీవుడ్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో అన్న విజయ దేవరకొండ అదరకొడితే, దొరసాని చిత్రంతో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సెన్సేషనల్ స్టార్ గా విజయ్ దేవరకొండ ఒక్క చిత్రంతో స్టార్ హీరో అయిపోగా, ఆనంద్ వరుసగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలతో ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కానీ ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. అయితే లేటెస్ట్ గా దేవరకొండ బ్రదర్స్ గురించి ఒక సూపర్ స్పెషల్ న్యూస్ వినిపిస్తోంది.

అదేమిటంటే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు అంటూ ప్రచారం మొదలయ్యింది. విజయ దేవరకొండ ప్రస్తుతం లైగర్ చిత్రంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మినహా మొత్తం  కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ ఉండనుంది.

అయితే ఈ మూవీ లో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఓ సీన్ లో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. అయితే ఈ సీన్ ఇంకా షూట్ చేయలేదట మొదట ఆ పాత్ర కోసం వేరే నటుడిని ఎంపిక చేయగా కొన్ని కారణాల వలన ఇపుడు ఆ పాత్ర కోసం ఆనంద్ ని చేయాలని అడిగినట్లు సమాచారం. ఈ విషయం ఇప్పటి వరకు లీక్ చేయకుండా సస్పెన్స్ గా ఉంచారట. మరి చూద్దాం ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: