సినిమా పరిశ్రమకు కరోనా భయం గట్టిగానే పట్టుకుంది.కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేశాయి. ఇక ఆ తర్వాత సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత థియేటర్స్ లోకి దిగిన మీడియం రేంజ్ మాస్ సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసాయి. ఇక దసరా పండుగ నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ భారీ పరుగులు పెట్టింది. లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయి వంటి సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు థర్డ్ వేవ్ తర్వాత మాత్రం ఆ ఛాన్స్ పాన్ ఇండియా మూవీస్ మాత్రమే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ఏడాది ఆరంభంలోనే పాన్ ఇండియా సినిమాలు విడుదల కావాలి.

కానీ మళ్లీ కరోనా థర్డ్ వేవ్ రావడంతో ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక మార్చి నెలతో ఒమిక్రాన్ కంట్రోల్ అవుతుందని,అటు థర్డ్ వేవ్ కూడా తగ్గుముఖం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే మార్చి మూడవ వారం లేదా చివరి వారంలో బాక్సాఫీసు ముందుకు వచ్చేందుకు ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా రెడీ అవుతోంది. అన్నీ కుదిరితే మార్చి 18న వస్తా అంటున్నాడు ప్రభాస్. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ కు పోటీగా త్రిబుల్ ఆర్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ ఊహించినట్టే ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28 న సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మేరకు తాజాగా చిత్రబృందం అధికారిక ప్రకటన చేస్తూ ఓ నోట్ కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట, ఆచార్య వస్తుండడంతో అంతకంటే ముందే మార్చి 18న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట దర్శకనిర్మాతలు. ఒకవేళ అదే కనుక నిజమైతే  ప్రభాస్ వర్సెస్ రాజమౌళి బాక్సాఫీస్ ఫైట్ ఎంతో ఆసక్తికరంగా మారబోతోంది. మరి ఈ పోరులో ప్రభాస్ రాధేశ్యామ్ గెలుస్తుందా? లేక రాజమౌళి త్రిబుల్ ఆర్ గెలుస్తుందా? అనేది చూడాలి. మరోవైపు ఈ రెండు సినిమాలు కూడా ఫ్యాన్ ఇండియా స్థాయిలోనే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో విడుదల అవుతుండటం గమనార్హం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: