పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్ ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది ,  భీమ్లా నాయక్ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. భీమ్లా నాయక్ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఆ తర్వాత సంక్రాంతి బరి నుండి ఈ సినిమా తప్పుకొని, ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

  ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫిబ్రవరి 25 వ తేదీన ఈ సినిమా విడుదల కావడం అనేది సాధ్యపడే విషయమైనా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ క్రమంలో ఈ సినిమాను ఏప్రిల్ లో తీసుకురావాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది, అయితే ఏప్రిల్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలు విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే చిత్ర బృందాలు ప్రకటించాయి, దానితో  భీమ్లా నాయక్ సినిమా విడుదలకి మరో తేదీ ని లాక్ చేయనున్నట్లు ప్రస్తుతం ఓ టాక్ బలంగా నడుస్తోంది, మరి భీమ్లా నాయక్ సినిమా విషయంలో వస్తున్న వార్తల్లో ఎంత వరకు వాస్తవం అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: