టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన యువ డైరెక్టర్ అనిల్ రావిపూడి తొలిసారిగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా మెగాఫోన్ పట్టారు. శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయం సొంతం చేసుకుని దర్శకుడిగా అనిల్ కి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. అనంతరం మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం మూవీ తీసి దానితో కూడా సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, అనంతరం రవితేజ తో రాజా ది గ్రేట్ మూవీ తీసి మరొక విజయం తన ఖాతాలో వేసుకున్నారు.
ఆపైన వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఆయన తీసిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 2 కూడా సూపర్ హిట్ కొట్టింది. అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో నెక్స్ట్ సినిమాగా సరిలేరు నీకెవ్వరు తీసి కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుని ప్రేక్షకాభిమానులు నుండి మంచి పేరు అందుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఎఫ్ 2 కి సీక్వెల్ గా మరొక్కసారి వెంకీ, వరుణ్ లతో ఎఫ్ 3 మూవీ తీస్తున్నారు. ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా మొదటి భాగాన్ని మించేలా తాను తీస్తున్న ఈ సినిమా కూడా తప్పకుండా ఆడియన్స్ మనసు దోచుకుంటుందని ఇటీవల అనిల్ పలు ఇంటర్వూస్ లో చెప్పారు.

అయితే విషయంలోకి వెళితే దర్శకుడిగా అనిల్ తీసిన తొలి సినిమా పటాస్ నిన్నటితో విడుదలై సక్సెస్ఫుల్ గా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక దర్శకుడిగా తన సినిమాలో ఏదో ఒక ఫన్నీ మ్యానరిజం పెట్టి ఆడియన్స్ ని ఆకట్టుకునే అనిల్ రావిపూడి, టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు కూడా అభినందనలు తెలియ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం తదుపరి బాలయ్య తో, మరొక్కసారి మహేష్ తో అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో కూడా అనిల్ రావిపూడి సినిమాలు తీయనునట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: