తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా తరుణ్ హీరోగా రూపొందిన నీమనసు నాకు తెలుసు మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు త్రిష. ఆ తరువాత ప్రభాస్ హీరోగా శోభన్ తీసిన వర్షం సినిమా హీరోయిన్ గా ఆమెకు సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. అప్పట్లో వర్షం అతి పెద్ద సక్సెస్ కొట్టింది. ఆపైన సిద్దార్థతో ఆమె నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కూడా సూపర్ హిట్ కొట్టి త్రిషకి మరింత పేరు తెచ్చిపెట్టింది.

ఇక అక్కడి నుండి టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుసగా అవకాశాలు అందుకున్న త్రిష, ఆపై మహేష్ తో సైనికుడు, అతడు పవన్ కళ్యాణ్ తో తీన్మార్, అలానే ఎన్టీఆర్ తో దమ్ము సహా సీనియర్ నటులు నాగార్జునతో కింగ్, వెంకటేష్ తో నమోవెంకటేశ, చిరుతో స్టాలిన్, బాలయ్యతో లయన్ వంటి సినిమాలు చేసి స్టార్ నటిగా మంచి పేరు, గుర్తింపు సంపాదించారు.

అయితే ఒకప్పటితో పోలిస్తే తెలుగులో ప్రస్తుతం త్రిషకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. కాగా ప్రస్తుతం తమిళ్ లో మాత్రం అక్కడక్కడా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు త్రిష. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఆమె తెలుగులో బృంద పేరుతో సోనీ లైవ్ ఓటిటి వారు నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇందులో ఆమె పోలీస్ అధికారిణి పాత్ర చేస్తున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆ వెబ్ సిరీస్ నుండి షూటింగ్ స్పాట్ లో సరదాగా కొన్ని కుక్కలతో కలిసి ఆప్యాయంగా సరదాగా గడుపుతూ దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు త్రిష.

ఎప్పుడూ తన లేటెస్ట్ స్టైల్స్, ఫోటోషూట్స్ లో భాగంగా దిగిన ఫోటోలు పోస్ట్ చేసే త్రిష, ఈవిధంగా చక్కగా పెట్స్ తో సమయం గడుపుతూ దిగిన ఫోటో చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు. ఈ విధంగా కుక్కలతో చక్కగా చెలిమి చేస్తూ త్రిష తామందరి మనసులు దోచారు అంటూ పలువురు ప్రేక్షకులు సైతం ఆమెపై తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్రిష పోస్ట్ చేసిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: