పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు, ఆ తర్వాత మళ్లీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్  ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించడంతో ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా నటిస్తున్నాడు.

 ఈ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ను కూడా కొంత భాగం పూర్తి చేశాడు, ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు, మరియు టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ లు కూడా కొన్ని రోజుల క్రితమే జరిగిపోయాయి, అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మరియు సురేందర్ రెడ్డి లకు కేవలం 60 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయాలనే కండిషన్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, అంటే ఒక్కో సినిమాకు రెండు నెలలు మాత్రమే పవన్ కళ్యాణ్ కేటాయించనున్నట్లు ఈ వార్తల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: