టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే చిత్రం తొందర్లోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వాసుల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తూ ఉండడంతో వీరిద్దరి కలయికలో సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి మరి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవుతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా సెట్ అవ్వడానికి ఉన్న కారణాలను ఇప్పుడు అన్వేసిస్తున్నారు కొంత మంది నెటిజన్లు చెబుతున్నారు.

ఇక నిజానికి ఓ దర్శకుడు హీరో లు రెండు సినిమాలు చేసిన తర్వాత ఇంత గ్యాప్ తర్వాత సినిమా రావడానికి కారణం ఏదో ఒకటి ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అతడు సినిమాకి ఖలేజా సినిమాకి పెద్దగా సమయం తీసుకుని వీరిద్దరూ ఈ సినిమా కోసం ఇంత సమయం తీసుకోవడం పట్ల నెటిజన్స్ పలు సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. ఇక అప్పట్లో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అవే నిజం అన్నట్టుగా ఇప్పుడు కొన్ని వార్తలు చెబుతున్నారు.

అంతేకాదు.. ఆ గొడవ ఎందుకు జరిగింది దేనికోసం జరిగింది అనే విషయం ఎంతవరకు తెలియక పోయినా కూడా ఈ మూడవ చిత్రం సెట్ అవడానికి కారణం మాత్రం నమ్రత అని తెలుస్తోంది. అయితే మహేష్ సినిమా వ్యవహారాలను చూసుకునే ఆమె ఈ సినిమా చేయడానికి చాలా కష్టపడిందనీ సమాచారం. ఇక  వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోవడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇక చివరికి ఆమె వీరిద్దరి కలయికలో సినిమా రావడం కోసం గట్టి ప్రయత్నం చేసి అందులో నమ్రత సక్సెస్ అయిందనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: