రామ్ చరణ్ తో కలిసి ఆయన ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తుండగా దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మొదట్లోనే ఈ సినిమాకు కండిషన్స్ పెట్టి ఈ సినిమాను మొదలు పెట్టారని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాకూడదనే కండిషన్ శంకర్ కు పెట్టారట. ఆ విధంగానే ముందుకు వెళ్ళిన ఈ చిత్ర బృందం ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు బడ్జెట్ దాటిపోతుందని వార్తలు టాలీవుడ్ లో వినపడుతున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని విడుదల చేసే విధంగా రామ్ చరణ్ ప్లాన్ చేశారు.
అయితే ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోతుందని దాంతో చాలా ఇబ్బందులు వస్తాయని దిల్ రాజు రామ్ చరణ్ ఈ మధ్యనే చెప్పాడట. కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమా కూడా ఇలాగే ఆర్థిక కష్టాలతో మధ్యలోనే ఆగిపోయింది. దానికి తోడు ఆ సినిమాకు కొన్ని ప్రమాదాలు జరగడం కూడా ఈచిత్రం ముందుకు వెళ్ళకపోవడానికి కారణం అయ్యింది. అలా శంకర్ ఎన్నో అనుమానాల మధ్య ఈ సినిమాను మొదలు పెట్టగా ఇప్పుడు ఈ చిత్రం కూడా ఆర్థిక కష్టాల లోకి వెళుతూ ఉండడం మెగా అభిమానులను ఏ మాత్రం మెప్పించడం లేదు అని చెప్పాలి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ దీని పై ఎవరైనా స్పందిస్తేనే మెగా అభిమానులు కుదుట పడేది.