అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో రాశి ఖన్నా కు టాలీవుడ్ లో  క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన రాశి  ఖన్నా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాశి కన్నా తెలుగులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాతో పాటు గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే పక్కా కమర్షియల్ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి.

 ఈ సినిమాలతో పాటు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్ట్ లలో  నటిస్తోంది, రాశి ఖన్నా కేవలం తెలుగు, హిందీ భాషల సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రాశి ఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. మలయాళ మూవీస్ పూర్తిగా కంటెంట్ రిచ్ నెస్ తో ఉంటుంది… తెలుగు సినిమా ఎక్కువగా కమర్షియల్ గా ఉంటుంది, హిందీ మూవీస్ ఇప్పటికీ దాని స్థానం ఎక్కడుందో వెతికేందుకు ప్రయత్నిస్తోంది అని రాశి ఖన్నా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: