అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది,  ఈ సినిమా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా శృతి హాసన్ కు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను తీసుకు వచ్చింది. గబ్బర్ సింగ్ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది, అలా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన శృతి హాసన్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, అయితే అలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది, అయితే ఆ తర్వాత కాటమరాయుడు సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది, అయితే పోయిన సంవత్సరం విడుదలైన క్రాక్, మరియు వకీల్ సాబ్ సినిమాలతో ఈ ముద్దుగుమ్మ ఒకే సంవత్సరం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది,  దానితో మరోసారి శృతి హాసన్ టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.

అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. స‌లార్‌లో చాలా మంచి రోల్ లో కనిపించనున్న..అలాగే  సెట్లో ప్ర‌భాస్ స‌ర‌దాగా ఉంటారు, మేమిద్దరం అనేక విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటాం. ప్రభాస్ ఎక్కువగా మాట్లాడాడు అని అందరూ అనుకుంటారు, కానీ వాటిలో నిజం లేదు. ఆయన చాలా బాగా మాట్లాడుతాడు అని శృతి హాసన్ చెప్పింది. ఇది ఇలా ఉంటే శృతి హాసన్,  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: