తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత ఒక్కసారిగా కనుమరుగైన హీరోల గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది జె.డి.చక్రవర్తి. గులాబీ సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరైనా జేడీ చక్రవర్తి.. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అనగనగా ఒక రోజు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన జె.డి.చక్రవర్తి ఇక ఆ తర్వాత దెయ్యం సినిమాతో అందరిని భయపెట్టేసాడు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక జె.డి.చక్రవర్తి జోష్ చూసి స్టార్ హీరో అవుతాడు అని అనుకున్నారు.


 కానీ ఆ తర్వాత మాత్రం సినిమా అవకాశాలు లేకపోవడంతో హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు జెడి చక్రవర్తి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశాడు. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం తెలుగు తెరపై ఎక్కువగా కనిపించడం లేదు.. దీంతో జె.డి.చక్రవర్తి ని అభిమానులు అందరూ ఎంతగానో మిస్ అవుతున్నారు. మరోసారి ఒక మంచి పాత్రలతో జె.డి.చక్రవర్తి తెరమీదకి రావాలని కోరుకుంటున్నారూ అభిమానులు. ఇకపోతే ఇటీవలే జె డి చక్రవర్తి ఒక బుల్లితెర కార్యక్రమంలో అలరించారు.



 ప్రస్తుతం ఈ టీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో జె.డి చక్రవర్తి స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇక జె.డి.చక్రవర్తి ని చూసిన అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోయారు. హమ్మయ్య మా అభిమాన హీరో జె.డి.చక్రవర్తి ఎన్నాళ్లకి కనిపించాడు అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. కళ్లద్దాలు పెట్టుకొని ఎంతో క్లాసిక్ గా ఎంట్రీ ఇచ్చిన జెడి చక్రవర్తి ఇక గెస్ట్ సీట్లో కూర్చొని ఇక అక్కడ జబర్దస్త్ కమెడియన్స్ అందరూ చేసిన పర్ఫామెన్స్ లని చూస్తూ తెగ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jd