ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. యువ హీరో సాయి ధరమ్ తేజ్ కి తమ్ముడైన వైష్ణవ్ తేజ్, ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా ఉప్పెనలో తనదైన ఆకట్టుకునే యాక్టింగ్ టాలెంట్ తో అందరినీ ఎంతో అలరించి మంచి పేరు అందుకున్నారు. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగటివ్ పాత్ర చేయగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఇక దీని తరువాత క్రిష్ జాగర్లమూడి తీసిన కొండపొలం సినిమాలో నటించిన వైష్ణవ్ తేజ్మూవీ తో కూడా మంచి పేరు అందుకున్నారు. ఆ విధంగా హీరోగా రెండు సినిమాలతో ఆడియన్స్ మనసు గెలుచుకున్న పంజా వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమాకి రంగరంగ వైభవంగా అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. యువ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీకి గిరిశాయ దర్శకత్వం వహిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ యూట్యూబ్ లో ప్రస్తుతం మంచి వ్యూస్ తో కొనసాగుతోంది.

యూత్ఫుల్ గా అలానే ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ అంశాల కలబోతగా దర్శకుడు ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా అద్భుతంగా తీస్తున్నారని, ఇక స్క్రీన్ పై వైష్ణవ్, కేతిక ల జోడీ అదిరిపోతుందని యూనిట్ అంటోంది. అలానే హీరోగా వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా మరొక సక్సెస్ ని అందించడం ఖాయం అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ రంగరంగ వైభవంగా సినిమాని ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నట్లు టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: