కంచె సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై మంచి మంచి అవకాశాలను అందుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్.ఈ హీరోయిన్సినిమా లో నటించిన తీరు కు చిత్ర లోకం దాసోహం అయ్యిందనే చెప్పాలి. కట్టుబొట్టు సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఆమె సినిమాలో నటించిన తీరు కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. గ్లామర్ పాత్రలకు ఏమాత్రం ఆస్కారం లేని పాత్ర కావడంతో ఆమె ఆ విధంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అయితే ఆమె తదుపరి సినిమాలో చేసిన పాత్ర చూసి ఒక్క సారిగా అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు అనే చెప్పాలి.

మొదటి సినిమాలో ఆమె కనిపించిన తీరుకు పూర్తిగా వ్యతిరేకంగా సెకండ్ సినిమాలో కనిపించడంతో ఆమె పై ఒక్కసారి గా అందరి ఫోకస్ మళ్లింది. ఈమెలో ఈ కోణం కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. అలా గ్లామర్ తో నటనతో భవిష్యత్తులో మంచి మంచి సినిమా అవకాశాలు అందుకునే విధంగా ఈమె ముందుకు వెళ్ళింది. అయితే ఈమెకు అంతటి స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. కెరీర్ ఓ మోస్తరుగానే ఉండటంతో దర్శక నిర్మాతలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇప్పుడు దాదాపుగా ఈమె కెరీర్ ఎండింగ్ కు వచ్చింది అనే అందరూ అనుకున్నారు. కానీ ఆమె అఖండ సినిమా లో చేసిన తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆమెకు భారీస్థాయిలో పేరు వచ్చింది. మంచి నటనతో నటించి అందరిని మరొకసారి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అఖండ సినిమా బాలకృష్ణ బోయపాటి శ్రీను లకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరి కూడా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. మరి ఆమెకు ఏ సినిమాలో భారీ అవకాశం వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: