కరోనా సెకండ్ వేవ్ అనంతరం టాలీవుడ్ బాక్సాఫీస్ కి భారీ స్థాయిలో లాభాలను అందించిన సినిమాల లిస్టులో నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా కూడా చోటు దక్కించుకుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక సినిమాలో బోయపాటి యాక్షన్ కి బాలయ్య పర్ఫామెన్స్ తోడవ్వడం, దానికి తగ్గట్టు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఎలివేట్ అవడంతో ఈ సినిమా ఎవరు ఊహించనంత స్థాయిలో సక్సెస్ను అందుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ పై గత కొన్ని రోజులుగా రకరకాల కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా అఖండ సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేసేందుకు కొందరు దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మన నార్త్ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం హిందూ దేవుళ్ళ పై సెటైర్స్ వేసే విధంగా సినిమాలు తీయడమే గాని.. దేవాలయాల గొప్పతనం, వాటి వెనకున్న చరిత్ర పై పెద్దగా సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు అఖండ లాంటి సినిమాను రీమేక్ చేస్తే నార్త్ ఇండియన్స్ ఎగబడి మరీ చూస్తారు అని చెప్పవచ్చు. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు అయిన అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అక్షయ్ కుమార్ ఇప్పటికే రామసేతు బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో అజయ్ దేవగన్ కూడా అలాంటి సినిమాలు చేశాడు. మరోవైపు ఇప్పటికే టాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకున్నారు. అయితే అఖండ లాంటి సినిమాను హ్యాండిల్ చేయాలంటే అనుభవజ్ఞుడైన మంచి డైరెక్టర్ కూడా కావాలి. మరి అఖండ రీమేక్ రైట్స్ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ లో ఎవరికి దక్కుతుందో?ఏ దర్శకుడు ఈ రీమేక్ ని డైరెక్ట్ చేస్తాడో? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: