ఇక ఈ మూవీ అనంతరం త్వరలో గోపీచంద్ మలినేనితో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు బాలయ్య. శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ వారు నిర్మించనుండగా థమన్ సంగీతం సమకూర్చనున్నారు. అయితే ఈ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మంచి మాస్ మూవీగా రూపొందనుందని, తనకు ఎంతో ఇష్టమైన బాలయ్య తో చేస్తున్న సినిమా కావడంతో కథ, కథనాల విషయంలో దర్శకుడు గోపీచంద్ ఎంతో పక్కాగా శ్రద్ద తీసుకుంటున్నారని టాక్.
కాగా అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా గురించి ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా థమన్ మాట్లాడుతూ, బాలయ్య గారి మూవీ కోసం ఈసారి మరింత అద్భుతంగా సాంగ్స్ ని సిద్ధం చేస్తున్నామని, ముఖ్యంగా కొద్దిరోజులుగా నేను, గోపీచంద్ ఇద్దరం కలిసి మాట్లాడుకుని, గతంలో బాలయ్య నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రేంజ్ లో ఈ మూవీ సాంగ్స్ అదిరిపోవాలని నిర్ణయించాం అన్నారు. అలానే ఈ కథకి బీజీఎమ్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఇచ్చేనందుకు కృషి చేస్తున్నానని, తప్పకుండా అఖండ తరువాత బాలయ్య, తన కాంబినేషన్ లో రానున్న ఈ మూవీ భారీ సక్సెస్ కొడుతుందని ఆశాభావాన్ని థమన్ వ్యక్తం చేసారు.