ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా తన్న సత్తా ఇప్పుడు చాటుతుంది అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో థియేటర్ లలో దద్దరిల్లిన మూడు సినిమాలు ఇప్పుడు కూడా ఓ టీ టీ లో కూడా దద్ధరిల్లిపోతున్నాయి. వాటి జోరు ముందు ఇతర భాషల సినిమాలేవీ కూడా యూజర్స్ కి కనపడటం లేదని సదరు ఓ టీ టీ సంస్థలు తెలుపుతున్నాయి. ఇటీవల కాలంలో మూడు తెలుగు సినిమాలు ఓ టీ టీ విడుదలయ్యాయి. 3 వివిధ ఓ టీ టీ సంస్థలలో విడుదల కావడంతో ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆదరిస్తూన్న సినిమాలుగా ఉన్నాయి అని తెలిపాయి. మరి ప్రేక్షకులను అలరిస్తున్న ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ హాట్ స్టార్ లో విడుదల అయ్యి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంటుంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఎంతటి స్థాయిలో రెస్పాన్స్ అందుకుందో అంతకుమించిన రెస్పాన్స్ ఇప్పుడు ఓ టీ టీ లో విడుదల అయిన తర్వాత వస్తుండటం విశేషం. ఇకపోతే నెట్ ఫ్లిక్స్ లో నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రం కూడా ఇదే తేదీన విడుదల కాగా ఆ యాప్ లో ప్రేక్షకులు ఈ సినిమా ఆదరిస్తూ భారీ స్థాయిలో హిట్ చేస్తున్నారట. ఆ విధంగా ఈ రెండు సినిమాలు టాప్ లెవెల్ లో ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం విశేషం. 

ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం థియేటర్ల లో విడుదలైన 20 రోజుల వ్యవధిలోనే ఓ టీ టీ విడుదల కావడం కొంత మంది అభిమానులను నిరాశపరిచిన కూడా ఇప్పుడు అక్కడ ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. థియేటర్లలో విడుదలైన దాని కంటే ఎక్కువగా ఈ సినిమా ఓటీటీ లో విడుదలైన దానికి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు కొడుతుందో చూడాలి. ఆ విధంగా ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయని చెప్పవచ్చు. 





 

మరింత సమాచారం తెలుసుకోండి: