మార్చి నెలలో పుష్ప 2 షూటింగ్ అని అన్నారు. అయితే పార్ట్ 1 భారీ హిట్ సొంతం చేసుకోవడంతో పుష్ప 2కి డైరెక్ట్ గా భారీ ఆఫర్ వచ్చిందట. 400 కోట్లతో కేవలం థియేట్రికల్ రైట్స్ ఇవ్వమని బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్ వచ్చిందట. పుష్ప పార్ట్ 2 కోసం వారు భారీ మొత్తం వెచ్చించడానికి రెడీ అవుతున్నారు. పుష్ప 2 ది రూల్ సినిమాలో అసలు కథ ఉంటుందని డైరక్టర్ సుకుమార్ ఊరిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎలాగు సూపర్ హిట్ కలక్షన్స్ తెస్తుందని హిందీ బడా సంస్థ 400 కోట్ల ఆఫర్ తో మైత్రి మేకర్స్ దగ్గరకు వచ్చారట.
అయితే పుష్ప నిర్మాతలు మాత్రం అలా సినిమా మొత్తం అన్ని భాషల థియేట్రికల్ రైట్స్ అమ్మడానికి సుముకంగా లేరట. ఇక థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ ఇలా అన్ని కలుపుకుంటే పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 రెండిటికి కలిపి 1000 కోట్ల బిజినెస్ జరిగినట్టే అన్నమాట. ప్రభాస్ తర్వాత 1000 కోట్ల దమ్మున్న హీరోగా అల్లు అర్జున్ నిలబడ్డాడు. అందుకే పుష్ప తర్వాత కూడా అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాడు.