తెలుగులో డైరెక్టర్ త్రివిక్రమ్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. తను తీసే సినిమాలు విభిన్నమైన స్టోరీలతో బాగా ఆకట్టుకుంటాయి.. ఇక అంతే కాకుండా తను తీసే సినిమాలా టైటిల్ విషయంలో..ఆ అనే అక్షరం ఖచ్చితంగా ఉండేలా తన ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా తనకు ఏ హీరోయిన్ అయినా బాగా నచ్చితే చాలు ఇక ఆమెకి వరుస ఆఫర్లను ఇస్తూ ఉంటాడు.. గత సినిమాల పరంగా చూసుకుంటే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది.


త్రివిక్రమ్ జల్సా , జులాయి సినిమా లో హీరోయిన్ ఇలియానా నటించింది. ఇక సమంత కూడా అత్తారింటికి దారేది, ఆ ఆ, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలలో నటించింది. ఇక పూజా హెగ్డే కూడా అరవింద సమేత, SSMB 28 , అలా వైకుంఠపురం సినిమాలో ఈమె నే హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ మూవీ లో.. రానా సరసన మలయాళం హీరోయిన్ సంయుక్తమీనన్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ముందుగా ఈ సినిమాలో ఈ పాత్ర కోసం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ని అనుకోగా.. కానీ ఆ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోవడం జరిగింది. కానీ చివరికి సంయుక్త మీనన్ ని చిత్ర బృందం ఎంచుకోవడం జరిగింది.. దీంతో ఆ హీరోయిన్ త్రివిక్రమ్ కి బాగా నచ్చడంతో ఇతర సినిమాల్లో సైతం ఆమెను తీసుకుబోతున్నాడు అనే వార్త బాగా వినిపిస్తోంది.

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ గా మారి సితార ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సార్.. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాని అన్ని భాషలలో నిర్మించడం జరుగుతోంది.. ఇందులో హీరోగా ధనుష్ నటిస్తున్నాడు.. ఇక ఈయనకు జోడీగా హీరోయిన్ సంయుక్త మీనన్ ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అలాగే త్రివిక్రమ్ నిర్మాణం లో ఒక యువ హీరోతో చేస్తున్న సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: