మహేష్ బాబు భార్య.. నమ్రత శిరోద్కర్ ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది.. అంతేకాకుండా మహేష్ బాబు గురించి అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తెలియజేస్తూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక వీరిద్దరి చూడడానికి ఎంతో ముచ్చటగా కూడా ఉంటారు. ఇక తన కుటుంబానికి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని విషయాలను షేర్ చేస్తూ ఉంటారు వీరు.. ఇక అప్పుడప్పుడు మహేష్ బాబు సినిమాలకు సంబంధించి విషయాలను షేర్ చేస్తూ అభిమానులు ఖుషి చేస్తూ ఉంటుంది నమ్రత. ముఖ్యంగా తన ఫ్యామిలీతో గడిపే ట్రిప్స్ విషయంలో కూడా.. అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది నమ్రత.

అయితే ఇప్పుడు తాజాగా తన పిల్లలు ఇద్దరీ తో ఒక స్పెషల్ మూమెంట్ గల ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతోంది నమ్రత. జనవరి 22వ తేదీన తన పుట్టిన రోజు కావడం తో.. నమ్రత తనకెంతో ఇష్టమైన.. మహేష్, తన పిల్లలు ఇద్దరితో ఎంజాయ్ చేసిందట నమ్రత. ఇక ఆ సంబరాల నుంచి ఒక ర్యాండమ్ పిక్ ని షేర్ చేసింది. ప్రతిరోజు తన పిల్లలతో ఇలా గడపడం కంటే తనకు ఏది బెస్ట్ ఆప్షన్ కాదని చెప్పుకొచ్చింది. తన ఇద్దరు పిల్లల పై ఉన్న ప్రేమను మరొకసారి తెలియజేసింది నమ్రత. అలా పోస్ట్ చేసిన కొన్ని క్షణాల లోనే ఈ ఫోటో వైరల్ గా మారి లైక్ ల  వర్షం కురిపించింది.ఇక నమ్రత కి, మహేష్ బాబు కి తన కొడుకు,కూతురు అంటే ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఒకవైపు తమ ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్నప్పటికీ.. సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్పు వేస్తూ ఉంటారు మహేష్ బాబు. ఇక ఈ పోస్ట్ చూసిన కొంతమంది బెస్ట్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ, క్యూట్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్లలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: