ఇక వివరాల్లోకి వెళితే... సౌత్ ఇండియా హీరోలు అయిన యష్ మరియు అల్లు అర్జున్ ఫోటోలతో కంగానా రనౌత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేశారు, ఈ ఫోటోతో పాటు పుష్ప సినిమాలోని లోని ఊ అంటావా..ఉ ఉ అంటావా అనే సాంగ్ ను యాడ్ చేశారు కంగనా. ఈ పోస్ట్ తో పాటు.. సౌత్ కంటెంట్ తో పాటు సూపర్ స్టార్స్ లో ఇంతలా ఆవేశం ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి... అవి ఏంటంటే...
ఈ స్టార్ హీరో లు భారతీయ సంస్కృతి లో చాలా లోతుగా పాతుకు పోయారు.
ఆ హీరోలు తమ ఫ్యామిలీ లను ప్రేమిస్తారు, సంబంధాల విషయం లో వెస్టర్న్ దేశాలను అనుకరించకుండా, వాటిని వారు నిలుపుకుంటారు.
వారి అభిరుచి, వృత్తి నైపుణ్యం చాలా అసమానమైనది.
ఇలా కంగనా రనౌత్ రాసుకొచ్చింది, ఇక ఈ పోస్టు చివరిలో బాలీవుడ్ ఇండస్ట్రీ ని ప్రస్తావిస్తూ కంగనా రనౌత్ కాంట్రవర్సీ కామెంట్ లను చేశారు, సౌత్ హీరోలను బాలీవుడ్ వారు భ్రష్టు పట్టించడానికి అనుమతించకూడదంటూ కంగనా రనౌత్ చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.