అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా తెలుగు స్టార్ హీరోల సరసన నటించిన శ్రుతి హాసన్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. శృతి హాసన్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది, అయితే ఇలా కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే శృతి హాసన్ కొన్ని కారణాల వల్ల సినిమాలకు కొంత కాలం పాటు దూరం అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కాటమరాయుడు సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

  కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర శృతి హాసన్ కు ఆశించిన విజయాన్ని తెచ్చి పెట్టలేదు, ఇలాంటి సమయంలోనే శృతి హాసన్ తెలుగులో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు కలెక్షన్ ల వర్షం కురిపించింది. ఇలా క్రాక్ సినిమాతో  శృతి హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది, ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో శృతి హాసన్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో బ్లాక్ బస్టర్ విజయం దక్కింది, ఇలా ఒకే సంవత్సరం రెండు బ్లాక్ బస్టర్ విజయాలను శృతి హాసన్ దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా సలార్ లో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమా తో పాటు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇలా కొంత కాలం ప్లాప్ లతో డీలా పడిపోయిన శృతి హాసన్ ప్రస్తుతం మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: