తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా పేరు పొందింది.. సింగర్ సునీత.. ఇక తరచూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ మధ్య ఇమే.. తాజాగా తన రెండో వివాహం చేసుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ప్రస్తుతం ఆయనతో ఈమె చాలా సంతోషంగా ఉన్నట్లు పలుసార్లు తెలియజేసింది కూడా.. అయితే తన భర్త రామ్ వీరపనేని తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్న ట్లుగా తెలుస్తోంది.. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మ్యాంగో ఛానల్ ప్రతి ఒక్కరికీ తెలిసిన సంగతే..

అయితే ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ని అందిస్తూ ఉంటుంది. మ్యాంగో చానల్స్ లో కొన్ని వీడియోలను గౌడ మహిళలకు సంబంధించి వారిని వేశ్యలుగా చిత్రీకరించారు అంటూ కొంతమంది గౌడ కుల సంఘాలు వీరపనేని పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అందుచేతనే అలా చూపించిన ఆ యూట్యూబ్ ఛానల్ పై ఈ రోజున దాడి చేసేందుకు ప్రయత్నించినట్లుగా కూడా తెలుస్తోంది. తమ సామాజికవర్గ నికి చెందిన మహిళలను కించపరిచే విధంగా చేసిన కొన్ని వీడియోలను డిలీట్ చేయాలని.. లేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆగ్రహం చేస్తున్నారు.

అయితే ఈ సంఘటన పై మాత్రం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రామ్ వీరపనేని సింగర్ సునీత ను రెండు సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. సునీత తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో.. ఆ తర్వాత రామ్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం సునీత భర్త ఈ విషయంలో బాగా వైరల్ గా మారుతున్నారు. అయితే ఈ విషయంపై సింగర్ సునీత, భర్త రామ్ వీరపనేని స్పందిస్తారెమో వేచి చూడాల్సిందే..ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఉండే వారి పైన ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: