కార్తీక్ ఆర్య కథానాయకుడిగా అతడి సరసన కృతిసనన్ హీరోయిన్గా బాలీవుడ్లో షెహజాద్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనిని రోహిత్ ధావన్ దర్శకత్వంలో భూషణ్కుమార్, ఆమన్గిల్ నిర్మిస్తుండగా అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప చిత్రం సంచలన విజయం సాధించడంతో అతడికి బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అలవైకుంఠపురం చిత్రం డబ్బింగ్ రైట్స్ చేతిలో ఉన్న బాలీవుడ్ నిర్మాత మనీష్ షా సహజంగానే అల్లు అర్జున్ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఆ చిత్రాన్నిహిందీలో డబ్ చేసి థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో షెహజాద్ చిత్ర బృందం షాక్ తింది. తమ చిత్రం ఇంకా షూటింగ్లో ఉండగానే దాని డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో వస్తే తమ సినిమా పరిస్థితి ఏమిటంటూ మనీష్ షాకు తమ అసంతృప్తిని తెలియజేసింది. పోనీ ప్రాజెక్టును విరమించుకుందామంటే ఇప్పటికే దాదాపు 40 కోట్లకు పైగా షెహజాద్పై వెచ్చించినట్టు తెలుస్తోంది. ఇటు మనీష్ షా కూడా తాను డబ్బింగ్ వెర్షన్ సిద్ధం చేసుకున్నానని ఇప్పుడు వెనక్కు తగ్గితే తనకు రూ. 20 కోట్లు నష్టమని చెపుతుండటంతో వివాదం పెరిగింది. మనీష్ షా ఇప్పటికే పలు దక్షిణాది సినిమాలను హిందీలో అందించడం ద్వారా ఇక్కడి నిర్మాతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య జరిగిన చర్చలు సంప్రదింపులు ఫలించి మనీషా షా తన డబ్బింగ్ వెర్షన్ విడుదలను వాయిదా వేసుకున్నట్టు తెలపడంతో ఈ గొడవ సుఖాంతమైంది. అయితే ఆయన థియేటర్లో విడుదల ప్రస్తుతానికి విరమించుకున్నా దానిని తన చానల్ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కార్తీక్ ఆర్య కథానాయకుడిగా అతడి సరసన కృతిసనన్ హీరోయిన్గా బాలీవుడ్లో షెహజాద్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనిని రోహిత్ ధావన్ దర్శకత్వంలో భూషణ్కుమార్, ఆమన్గిల్ నిర్మిస్తుండగా అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప చిత్రం సంచలన విజయం సాధించడంతో అతడికి బాలీవుడ్లోనూ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అలవైకుంఠపురం చిత్రం డబ్బింగ్ రైట్స్ చేతిలో ఉన్న బాలీవుడ్ నిర్మాత మనీష్ షా సహజంగానే అల్లు అర్జున్ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఆ చిత్రాన్నిహిందీలో డబ్ చేసి థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో షెహజాద్ చిత్ర బృందం షాక్ తింది. తమ చిత్రం ఇంకా షూటింగ్లో ఉండగానే దాని డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో వస్తే తమ సినిమా పరిస్థితి ఏమిటంటూ మనీష్ షాకు తమ అసంతృప్తిని తెలియజేసింది. పోనీ ప్రాజెక్టును విరమించుకుందామంటే ఇప్పటికే దాదాపు 40 కోట్లకు పైగా షెహజాద్పై వెచ్చించినట్టు తెలుస్తోంది. ఇటు మనీష్ షా కూడా తాను డబ్బింగ్ వెర్షన్ సిద్ధం చేసుకున్నానని ఇప్పుడు వెనక్కు తగ్గితే తనకు రూ. 20 కోట్లు నష్టమని చెపుతుండటంతో వివాదం పెరిగింది. మనీష్ షా ఇప్పటికే పలు దక్షిణాది సినిమాలను హిందీలో అందించడం ద్వారా ఇక్కడి నిర్మాతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య జరిగిన చర్చలు సంప్రదింపులు ఫలించి మనీషా షా తన డబ్బింగ్ వెర్షన్ విడుదలను వాయిదా వేసుకున్నట్టు తెలపడంతో ఈ గొడవ సుఖాంతమైంది. అయితే ఆయన థియేటర్లో విడుదల ప్రస్తుతానికి విరమించుకున్నా దానిని తన చానల్ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.