సౌత్ ఇండియన్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే కొన్ని సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్లో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడు తమిళంలో అజిత్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'విశ్వాసం' హిందీలో రీమేక్ కాబోతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మనీష్ షా ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమా రీమేక్ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. 

అయితే తాజా సమాచారం ప్రకారం 'విశ్వాసం' సినిమాలో అజిత్ పోషించిన పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఇద్దరూ కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది  దానికీ ఓ కారణం ఉందట. విశ్వాసం సినిమా ప్రధాన భాగం హిందీ ప్రేక్షకుల సెన్సిబిలిటీకి సరిపోదని ఈ ఇద్దరు స్టార్ హీరోలు భావించినట్లు తెలుస్తోంది. అందుకే విశ్వాసంలో అజిత్ రోల్ ని ఈ స్టార్ హీరోలు తిరస్కరించారట. ఇక మరోవైపు విశ్వాసం రీమేక్ రైట్స్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. తమిళంలో ఈ సినిమాను మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు.

అయితే విశ్వాసం హిందీ రీమేక్ కు బాలాజీ టెలీ ఫిలింస్ వాళ్లు సహా నిర్మాత గా ఉండాలని తాజాగా మనీషా ను సంప్రదించినట్లు సమాచారం. అయితే అజిత్ లాంటి స్టార్ హీరో సినిమాని బాలీవుడ్ లో ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు రిజెక్ట్ చేయడం ఇప్పుడు గమనార్హం గా మారింది. అయితే నిజానికి 2019 వ సంవత్సరం లోనే డైరెక్టర్ శివ ఈ ప్రాజెక్టును బాలీవుడ్ అగ్రహీరో షారుక్ ఖాన్ కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో జీరో సినిమా భారీ పరాజయాన్ని చవిచూడటం తో అతను దాన్ని తిరస్కరించాడట. ఇక మళ్లీ తాజాగా ఇప్పుడు మనీష్ షా ఈ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.మరి ఈ రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారు చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: