సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పరశురాం డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ కి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ మరోసారి పోకిరి లాంటి రఫ్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట సినిమా త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తుంది. మహేష్ కి కొవిడ్ రావడం.. ఆ తర్వాత మహేష్ సోదరుడు రమేష్ బాబు మరణం ఇవన్ని మహేష్ ని డిస్ట్రబ్ చేశాయి. అయితే మహేష్ ఇప్పుడు అంతా సెట్ రైట్ చేసుకుని షూటింగ్ కి రెడీ అంటున్నాడట. మార్చి కల్లా ఎట్టి పరిస్థితుల్లో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. అలా పూర్తి చేస్తే మే నెలలో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తారని టాక్.

అదేంటి ఏప్రిల్ 1 న సర్కారు వారి పాట రిలీజ్ ఎనౌన్స్ చేశారు కదా అని అనుకోవచ్చు. కానీ మహేష్ అనుకున్న ఆ డేట్ కి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ ఫిక్స్ చేశారు. సో మహేష్ తప్పనిసరిగా మరోసారి సినిమా వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ మిస్సైతే మే నెలలో సర్కారు వారి పాట వస్తుందని అంటున్నారు. సర్కారు వారి పాట రిలీజ్ కాగానే త్రివిక్రం తో కమిటైన సినిమా పట్టాలమీదకు తెచ్చే ఆలోచన లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్. త్రివిక్రం సినిమా తర్వాత ఎలాగు జక్కన్న తో సినిమా అంటే రెండేళ్లు ఆయన కు రాసిచ్చేయాల్సిందే అని తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: