అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ తెలుగునాట వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి పలు బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి తెలుగునాట మంచి గుర్తింపును తెచ్చుకుంది. అలాగే త్రిష  తెలుగులో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, అయితే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు భాష సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

 ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న త్రిష గత కొంతకాలంగా ఎక్కువగా తమిళ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టింది, అది మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తుంది, అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించడానికి త్రిష ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నేరుగా సినిమా చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి  రీఎంట్రీ ఇస్తోంది,  వెండి తెరపై మాత్రమే కాకుండా,  ఓటిటి లో త్రిష సత్తా చాటబోతుంది, త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న  వెబ్ సిరీస్ కు బృంద అనే టైటిల్ ను చిత్ర బృందం ఫిక్స్ చేసింది. దసరా రోజున ప్రారంభం అయిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన త్రిష మరి రీ ఎంట్రీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: