కోలీవుడ్ స్టార్ విజయ్ ఇన్నాళ్లకు తెలుగు పరిశ్రమ మీద దృష్టి పెట్టాడు. తన ప్రతి సినిమా అడపాదడపా తెలుగులో డబ్ అవుతూ వచ్చినా తెలుగు రిలీజ్ ని ఎప్పుడూ అంత సీరియస్ గా తీసుకోలేదు దళపతి విజయ్. ఎప్పుడో మురుగదాస్ తుపాకి టైం లోనే తెలుగు ఈవెంట్ కి వచ్చాడు. ఆ తర్వాత తెలుగులో ఆయన సినిమాలు వస్తున్నా సరే ప్రమోషన్స్ చేయలేదు. కనీసం ఆయన సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంటే తెలుగు ఛానెళ్లకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో విజయ్ తో ఏకంగా డైరెక్ట్ తెలుగు సినిమానే ఫిక్స్ చేశాడు దిల్ రాజు.

వంశీ పైడిపల్లి డైరక్షన్ లో దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ మూవీగా విజయ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం పూర్తి కాగా ఫైనల్ వర్షన్ విజయ్ కు వినిపించారట వంశీ పైడిపల్లి. కథ విన్న విజయ్ అద్భుతం అనేశారట. అంతేకాదు 20 ఏళ్లలో ఇలాంటి కథ వినలేదని అన్నారని టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వంశీ చెప్పిన కథకు ఫ్లాట్ అయిన విజయ్ అని ఈ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే 20 ఏళ్లలో ఇలాంటి కథ వినలేదు.. దీని కోసమే చూస్తున్నా అంటూ చెప్పడం తమిళ మేకర్స్ ని హర్ట్ చేసింది.

అంటే విజయ్ ఇన్నాళ్లు సినిమా కథలు ఎలా ఓకే చేశాడు. అతను ఇప్పుడున్న స్టార్ డం తమిళ దర్శకులతో చేస్తేనే కదా వచ్చింది. తెలుగు దర్శకుడు కథ నచ్చితే కథ బాగుందని చెప్పాలి కానీ 20 ఏళ్లలో ఇలాంటి కథ వినలేదు. ఇలాంటి అద్భుతమైన కథ కోసమే చూస్తున్నా అంటూ చెప్పడం కోలీవుడ్ దర్శకులని ఇబ్బంది పెడుతుంది. అయితే విజయ్ టీం మాత్రం ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం విజయ్ నెల్సన్ డైరక్షన్ లో బీస్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ క్రేజీగా రానుంది. బీస్ట్ సినిమాలో తెలుగు స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. అక్కడ అమ్మడు ఎనిమిదేళ్ల తర్వాత తమిళంలో రీ ఎంట్రీ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: