కీర్తి సురేష్ తాజాగా నటిస్తున్న చిత్రం గుడ్ లక్ సఖి.. అదృష్టాన్ని పరీక్షించుకునే అమ్మాయి పాత్రలో కీర్తి సురేష్ మనకు కనిపించబోతోంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత సుధీర్ చంద్ర పడిరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు సినిమా మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా గుడ్ లక్ సఖి సినిమా కు వ్యవరిస్తున్నారు.

ఈ సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉంది 2020 ఆగస్టు 15వ తేదీన ట్రైలర్ విడుదల చేసినప్పటికీ , జూన్ 3 2021 ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లన్నీ మూతపడడంతో సినిమాలు కూడా వాయిదా వేయడం జరిగింది. సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న రమాప్రభ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఇకపోతే నిన్నటికి నిన్న ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ని విడుదల చేసి ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు.


అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా చిరంజీవి రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.. అన్నాత్తే  సినిమాలో కూడా  రజినీకాంత్ కి చెల్లెలు గా నటించిన కీర్తి సురేష్ మంచి ఇమేజ్ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు చిరంజీవికి చెల్లెలిగా కూడా నటిస్తోంది.. ఇక ఈ స్నేహం కారణంగానే ఈ రోజు చిరంజీవి.. కీర్తి సురేష్ నటిస్తున్న గుడ్ లక్ సఖి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్గా హాజరు కాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: