ప్రస్తుతం సినీ పరిశ్రమలో వరుస డైవర్స్ అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నాయి. నాగ చైతన్య, సమంత డైవర్స్ ప్రకటనతో షాక్ ఇవ్వగా లేటెస్ట్ గా ధనుష్, ఐశ్వర్య లు కూడా తాము విడిపోతున్నట్టు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్ తో దాదాపు సెపరేట్ అయినట్టే అని ఫిక్స్ అవుతున్నారు. వీరితో పాటుగా టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ తను చేస్తున్న మణికర్ణిక సినిమా టైం లోనే భార్య రమ్యతో విడిపోయారు.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మరో డైవర్స్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ అతని భార్య లతతో విడిపోతున్నాడని అంటున్నారు. దాదాపు వీరి విడాకులు ఖాయమైనట్టే అని చెప్పుకుంటున్నారు. తరుణ్ భాస్కర్ మదర్ గీతా భాస్కర్ కి లత సరైన గౌరవం ఇవ్వట్లేదని. అత్తాకోడళ్ల మధ్య గొడవ వల్లే తరుణ్ ఈ నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. తరుణ్ భాస్కర్ మదర్ గీతా భాస్కర్ ఈమధ్య సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఆమె అంటే తరుణ్ భాస్కర్ కి చాలా ఇష్టం.

అయితే కేవలం గీతా భాస్కర్ వల్లే అని కాకుండా లతతో తరుణ్ భాస్కర్ కి పర్సనల్ గా కూడా గొడవలు ఉండబట్టే డైవర్స్ దాకా వీళ్లు వెళ్లారని అంటున్నారు. లత కూడా తరుణ్ తో డైవర్స్ కి ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ లత కలిసి ఉండట్లేదని చెప్పుకుంటున్నారు. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన వైవాహిక జీవితంలో తీసుకున్న ఈ స్టెప్ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. తరుణ్ భాస్కర్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. స్టార్ హీరో కి కథ సిద్ధం చేఏసిన తరుణ్ భాస్కర్ ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: