ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న.. ఈ మధ్య కాలం లో అమ్మడు ఎటువంటి పాత్రలో కనిపించిన కూడా ఆ సినిమా భారీ హిట్ ను అందుకున్నాయి.. దాంతో అమ్మడు క్రెజ్ రోజు రోజుకు పెరిగిపొయింది. ఇప్పుడు మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. అయితే తెలుగు తో పాటుగా తమిళ్ లో కూడా వరుస సినిమా లలో నటిస్తూ పాపులర్ ఆవుతూ వస్తుంది. దీంతో సినిమా సినిమాకు రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి..



అంతేకాదు బాలివుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి.ఆమె నటించిన హిందీ చిత్రాలు 'మిషన్‌ మజ్ను, గుడ్‌ బై' విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈలోపు బాలీవుడ్‌ నుంచి మరిన్ని అవకాశాలు రష్మిక తలుపు తడుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ సినిమా లో నటించే బంపర్‌ ఆఫర్‌ రష్మిక ని వరించిందని బాలీవుడ్‌ లో ఒక వార్త బాలివుడ్ ఇండస్ట్రీలో కోడ్తెకూస్తుంది. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..



ఇది ఇలా ఉండగా.. ముంబయ్‌లోని కరణ్‌ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్‌ కార్యాలయానికి రష్మిక వెళ్లడం ఈ వార్తల కు బలం చేకూరుతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి.. కరణ్‌ నిర్మించనున్న ఓ చిత్రం లో రష్మికను హీరోయిన్ గా తీసుకోనున్నట్లు ఆ చిత్రానికి సంబంధించిన చర్చలు కార్యాలయం లో జరిగినట్లు తెలుస్తుంది. సుకుమార్‌ దర్శకత్వం లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన 'పుష్ప' చిత్రాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఆ సినిమాకు అభినందనలు తెలిపారు.. ఆ సినిమా తో ఫిదా అయిన అతను తన సినిమా లో ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల నుంచి పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్ళనుంది... ఆ సినిమాకు ఎంత సక్సెస్ అవుతుందని ఆసక్తి పెరుగుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: