మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, అందులో భాగంగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది,  ఏప్రిల్ ఒకటో తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. చిరంజీవి ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు,  ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది, ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.

 ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది, ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇలా ఈ సినిమాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు,  అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది, అందులో భాగంగా ఈ సినిమాలో త్రిష ను హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, మరి ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: