పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇక ఈ సినిమా కనుక మినిమం హిట్ అయినా కూడా మంచి వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. తెలుగు తో పాటు సౌత్ లో అన్ని భాషలు ఇంకా అలాగే హిందీలో కూడా లైగర్ సినిమా హిట్ అయితే పూరి జగన్నాద్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పూరి జగన్నాద్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగనమణ సినిమాను బాలీవుడ్ కు తరలించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.ఇక పూరి జగన్నాథ్ గత కొన్ని సంవత్సరాలుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆ సినిమాను చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫొటోతో ఆ సినిమా పోస్టర్ ను కూడా పూరి రిలీజ్ చేశాడు. కాని మహేష్ బాబు మాత్రం బిజీ షెడ్యూల్ ఇంకా అనేక ఇతర కారణాల వల్ల సినిమాను చెయ్యలేదు. ఇక అందుకే పూరి జగన్నాథ్ బాలీవుడ్ స్టార్ హీరోలతో ఈ సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

పూరి జగన్నాద్ ఇప్పటికే జనగనమణ సినిమా కథను బాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరోకు కూడా వినిపించాడట. ఆ కథను ఆ హీరో కూడా చేసేందుకు  ఓకే చెప్పాడని సమాచారం తెలుస్తోంది.ఇక ఇదే కథలో విలన్ గా మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించేందుకు ఓకే చెప్పాడట. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ చేస్తున్న లైగర్ సినిమాకు వచ్చే ఫలితాన్ని బట్టి ఆ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కే అవకాశాలు ఉంటాయని సమాచారం తెలుస్తుంది. లైగర్ సినిమా బాలీవుడ్ లో కనుక హిట్ అయితే హిందీలో జనగనమణ సినిమాను ఏ ఒక్కరు కూడా ఆపలేరు అనేది జనాల అభిప్రాయం. ఇక అదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మంచి సినిమా ను వదులుకున్న వాడు అవుతాడు అంటూ టాలీవుడ్ మీడియా వర్గాల వారు ఇంకా అలాగే సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రం తెలుగు లోనే పాన్ ఇండియా స్థాయిలో మహేష్ బాబుతో జనగనమణ సినిమాను చేయాలని పూరిని కోరుకుంటున్నారు. ఇక ఏం జరుగబోతుంది అనేది కాలం మాత్రమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: