చై తో విడాకుల తరవాత సమంత సోషల్ మీడియాలో చాలా దారుణమైన ట్రోల్స్ ఎదుర్కున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ళు తీవ్ర మనస్తాపంతో స్నేహితులతో కలిసి వరుస టూర్ లు ప్లాన్ చేసుకున్న సామ్ ప్రస్తుతం మళ్లీ రెగ్యులర్ గా సినిమాలతో బిజీ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే పుష్ప సినిమాలో 'ఉ అంటావా మావా ఉ ఊ అంటావా మావా...' పాటతో యువతలో కొత్త జోరు తీసుకొచ్చింది. అలాగే తాజాగా 'యశోద' షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు సామ్. కాగా యశోద మూవీ లాస్ట్ షెడ్యూల్ టైం లో సామ్ ఇంకా నాగ చైతన్య తన సినిమా షూటింగ్ ఇలా ఇరువురు కూడా ఓకె స్టూడియోలో షూటింగ్ నిమిత్తం ఒకే రోజు ఉండాల్సి వచ్చిందని అయితే ఒకరికొకరు తారసపడకుండా ఉండేలా సమంత చాలా జాగ్రత్త పడ్డారని వార్తలు చాలానే వినిపించాయి.

అయితే ఇపుడు మళ్లీ ఇదే తరహాలో సామ్ కు మరో చిక్కొచ్చి పడిందట. తను ఓకె చేసిన కొత్త ప్రాజెక్టులలో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఒక రోజంతా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో చేయాల్సి ఉందట. అయితే అదే రోజు నాగ చైతన్య మూవీ షూటింగ్ కూడా ఆ సెట్ పక్కనే కావడంతో షెడ్యూల్ మార్చాలని డైరెక్టర్ కి చెప్పారట సామ్, అయితే అప్పటికే హీరో, పలువురు ప్రముఖ నటులు డేట్స్ ఫిక్స్ అవడంతో కాస్త అడ్జస్ట్ చేసుకోండి అని డైరెక్టర్ అనగా, అందుకు సామ్ ఏకంగా నేను ఆ సినిమానే చేయను అన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న ఆమె అభిమానులు సామ్ ఇంకా విడాకుల ఒత్తిడిలో నుండి బయటకు రాలేదు అంటూ ఆందోళన చెందుతున్నారు.

మరి డైరెక్టర్ ఏమో సమంతను ఒప్పించే పనిలో పడ్డట్లు చెబుతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే  తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: