మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి తీసిన ఈ భారీ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలానే ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తుండగా డివివి దానయ్య ఈ మూవీని ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ మూవీ మార్చి 18న లేదా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుందని ఇటీవల యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాపై మన దేశంతో పాటు పలు ఇతర దేశాల సినిమా ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే.
ఇక దీనితో పాటు మరోవైపు ప్రఖ్యాత దర్శకుడు శంకర్ తో కూడా ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు చరణ్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పలు యాక్షన్ హంగులతో పాటు కమర్షియల్ హంగులని కలగలిపి అందరినీ ఆకట్టుకునే మూవీ గా దర్శకుడు శంకర్ ఈ సినిమా తీస్తున్నారని సమాచారం. దాదాపుగా ముప్పై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో జరగనుండగా ప్రస్తుతం ఈ భారీ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన జానీ మూవీలోని ఏ చోట నువ్వున్న అనే సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సాంగ్ యొక్క రికార్డింగ్ ప్రారంభించిన థమన్, అవుట్ ఫుట్ ఎంతో అద్భుతంగా ఉండేలా కష్టపడుతున్నారట. జానీ సినిమా ప్లాప్ అయినప్పటికీ అందులోని సాంగ్స్, మరీ ముఖ్యంగా ఏంటో మెలోడియస్ గా సాగే ఏ చోట నువ్వున్న సాంగ్ యువతని మరింతగా ఆకట్టుకుంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్ ఇది మంచి పండుగ వార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: