యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జనతా గ్యారేజ్. కొన్నేళ్ల క్రితం కొరటాల శివ తీసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కొట్టి హీరోగా ఎన్టీఆర్ కి అలానే దర్శకుడు గా కొరటాలకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత మరొకసారి ఎన్టీఆర్, కొరటాల జోడీ త్వరలో ఒక లేటెస్ట్ మూవీ కోసం జత కడుతున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీగా నిర్మితం కానున్న ఈ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి ఇటీవల ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు సమాచారం. ఈ సినిమా కథ అన్ని భాషల ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే నభూతో నభవిష్యతి అనే రేంజ్ లో ఉంటుందట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నాయిక అలియా భట్ నటించనుండగా కోలీవుడ్ యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దీనికి స్వరాలు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా యొక్క ప్రారంభోత్సవాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసారని, ఫిబ్రవరి 18న ఈ మూవీ ఓపెనింగ్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా రానున్నారని టాక్. ఇప్పటికే అల్లు అర్జున్ తో కూడా కొరటాల శివ కి ఒక ప్రాజక్ట్ ఓకె అవడం, మరోవైపు ఎన్టీఆర్ తో కూడా అల్లు అర్జున్ కి మంచి అనుబంధం ఉండడంతో, ఈ మూవీ యూనిట్ ఆహ్వానించిన వెంటనే అల్లు అర్జున్ ఈ ప్రారంభోత్సవానికి గెస్ట్ గా రావడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. మొత్తంగా రిలీజ్ కి ముందే ఈ విధంగా అందరిలో ఎంతో ఆసక్తిని ఏర్పరిచిన ఈ ప్రతిష్టాత్మక ఇసినిమా రేపు సెట్స్ మీదకు వెళ్లి, ఆపై విడుదల తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: