యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యూనివర్సల్ స్టార్ గా మారుతూ వరుస సినిమాలను ప్రకటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సినిమాల్లో 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక వీటితో పాటు సలార్, ఆది పురుష్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలతో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి తో రీసెంట్ గా 'స్పిరిట్' అనే మరో ప్రాజెక్టును కూడా ప్రభాస్ ప్రకటించాడు. అటు డైరెక్టర్ మారుతి తో కూడా ప్రభాస్  ఓ సినిమా లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇలా వరుస సినిమాలు కమిట్ అవుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కే' అనే ఓ స్పెషల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాలన్నింటి కంటే ముందే నాగ్ అశ్విన్ తో సినిమా ప్రకటించాడు ప్రభాస్. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అయింది. ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, అమితాబ్ లాంటి నటీనటులతో చాలా డిఫరెంట్ గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అశ్విన్. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే నాగ్ అశ్విన్ తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

అంతేకాదు ప్రాజెక్టు కే తర్వాత నాగ్ అశ్విన్ తర్వాతి సినిమా ప్రభాస్ తోనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది బాలీవుడ్ ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టును బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోతున్నారట. ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను.. ఆయన మార్కెట్ ను అంచనా వేసిన కరణ్ జోహార్.. ఇప్పుడు ప్రభాస్ తో భారీ ప్రాజెక్టును సెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని కరణ్ జోహార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి హ్యాండవర్ చేయడం కూడా జరిగిపోయింది అని అంటున్నారు. మరోవైపు 'ప్రాజెక్టు కే' కి సంబంధించి హిందీ వర్షన్ బాధ్యతలను కరణ్ జోహార్ స్వయంగా చూసుకుంటానని నాగ అశ్విన్ కి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది., మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: