టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ ఇమేజ్ వున్న యంగ్ హీరోల్లో నితిన్ కూడా ఒకడు. గతేడాది నితిన్ వరుస విజయాలను అందుకున్నాడు. అలాంటిది ఇప్పుడు నితిన్ కొత్త సినిమా మాత్రం కొన్ని బడ్జెట్ సమస్యలతో ఆగిపోయినట్టు తెలుస్తుంది. ఆ సినిమా పేరే 'పవర్ పేట'. నితిన్ తో గతంలో 'చల్ మోహన్ రంగా' అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు కృష్ణ చైతన్య మళ్లీ నితిన్తో ఇటీవల మరోసారి పవర్ పేట అనే సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెలుగుతో పాటు తమిళ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నితిన్ 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించాల్సి ఉంటుంది  దానికి కూడా నితిన్ రెడీ అయ్యాడు.

ఇక ఈ సినిమా కోసం 40 కోట్ల రూపాయల బడ్జెట్ను దర్శకుడు కృష్ణ చైతన్య నిర్మాతల ముందు ఉంచారట. అయితే నితిన్ మార్కెట్, దర్శకుడి క్యాపబిలిటీస్ వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ప్రాజెక్ట్ కోసం 40 కోట్ల భారీ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని నిర్మాతలు భావించారట. దాంతో తాజాగా ఈ ప్రాజెక్టును నిలిపివేశారని తెలుస్తోంది.ఇక ఈ ప్రాజెక్టు ఆగిపోవడంతో దర్శకుడు కృష్ణ చైతన్య కూడా తన నెక్స్ట్ సినిమా కి వెళ్లినట్లు సమాచారం. దర్శకుడు కృష్ణ చైతన్య ఇప్పుడు మరో యంగ్ హీరో శర్వానంద్ జతకట్టబోతున్నాడు. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

అయితే బడ్జెట్ సమస్యలతో నితిన్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా ఆగడం అనేది బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అయితే ప్రస్తుతం నితిన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు యువ దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: