అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. తన డెబ్యూ మూవీ 'ధడక్' తోనే అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొని నటన పరంగా ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ భామకి బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇక జాన్వికపూర్ ప్రస్తుతం హిందీ లో నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'. రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వికపూర్ క్రికెట్ ఆడే యువతి పాత్రలో కనిపించనుంది. అందుకోసం ప్రత్యేకంగా టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ వద్ద బ్యాటింగ్లో శిక్షణ తీసుకుంటోంది.

అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను రిపబ్లిక్ డే సందర్భంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది జాన్వికపూర్. ఇక ఆ ఫోటోలో హెల్మెట్ పెట్టుకుని ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇక మరో ఫోటో లో టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. మరో ఫోటోలో మూవీ టీం తో కలిసి సరదాగా ముచ్చటిస్తుంది. దీంతో ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిజానికి గత ఏడాదిలో నవంబర్ నెలలోనే ఈ సినిమా గురించి ఓ వీడియోని షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయినట్లు సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక మరోవైపు జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లో మొదటగా జాన్వీ కపూర్ హీరోయిన్  ఎందుకయింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు ఈ ప్రాజెక్టు నుంచి జాన్వి కపూర్ తప్పుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించబోయే నెక్స్ట్ ఫిలిం తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఆరంగేట్రం చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: