మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారిగా శ్రీకాంత్ అడ్డాల తీసిన ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా ద్వారా హీరోగా మంచి పేరు అందుకుని అక్కడి నుండి వరుసగా అనే సినిమా అవకాశాలు అందుకున్న వరుణ్ తేజ్, ఆపైన ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గడ్డలకొండ గణేష్ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో హీరోగా తెలుగు ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఎఫ్ 2 సీక్వెల్ గా రూపొందుతున్న ఎఫ్ 3 తో పాటు మరోవైపు యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటితో గని అనే మూవీ చేస్తున్నారు వరుణ్ తేజ్. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఎఫ్ 3 షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం గని మూవీ చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్నట్లు టాక్. బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే థమన్ స్వరపరిచిన ఒక సాంగ్ రిలీజ్ అయి అందరినీ ఎంతో ఆకట్టుకుని సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సిద్దు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ కమర్షియల్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్నట్లు టాక్. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇప్పటికే రెండు సార్లు ప్రకటించి కరోనా కారణంగా వాయిదా వేసిన యూనిట్, నేడు కొద్దిసేపటి క్రితం లేటెస్ట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు.

అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు త్వరలో పూర్తిగా తగ్గితే ఈనెల 25న గని మూవీ రిలీజ్ చేస్తాం అని, లేకపోతే ఆపైన పక్కాగా మార్చి 4న రిలీజ్ చేస్తాం అంటూ గని టీమ్ ప్రకటించింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ టీమ్, అలానే ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ లు రెండూ కూడా తమ సినిమాల కోసం రెండేసి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిలో ఆర్ఆర్ఆర్ ఫైనల్ గా మార్చి 25న తమ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు మొన్న ప్రకటించింది. ఇక ప్రస్తుతం వారి బాటలోనే గని కూడా రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం చూస్తుంటే ఈ కరోనా అన్ని సినిమాలపై గట్టిగానే ప్రభావం చూపించినట్లు తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: