పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.  అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సర్కారు వారి పాట సినిమా  తెరకెక్కుతుండగా ....ఈ ఏడాది జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని మొదట ప్రకటన వెలువడింది.ఇక సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ మూవీ రేసులో  ఉండటం వల్ల సర్కారు వారి పాట షూటింగ్ పూర్తికాకపోవడంతో... ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీకి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఇక    ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ మార్చి 25వ తేదీకి పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే.

అయితే దీని కావడంతో పాటు వేర్వేరు కారణాల వల్ల సర్కారు వారి పాట షూటింగ్ అనుకున్న విధంగా జరగక పోవడంతో ఈ సినిమా మే 12 వ తేదీకి వాయిదా పడింది.ఇకపోతే  మే నెలలో విడుదలైన మహేష్ బాబు సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం అందుకోక పోవడంతో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. అయితే మహేష్ బాబు హీరోగా తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన నిజం సినిమా మే నెలలోనే విడుదలైంది.ఇక మే నెల 23వ తేదీన విడుదలైన నిజం సినిమ  ప్రేక్షకులను అనుకొని  స్థాయిలో నిరాశపరిచింది.

అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా ఎస్ జె సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన నాని సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా 2004 సంవత్సరం మే నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఇక మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రహ్మోత్సవం  సినిమా కూడా మే నెలలోనే విడుదలైంది. అయితే బ్రహ్మోత్సవం సినిమా చూసిన వారందరూ ఈ సినిమా సీరియల్ లాగా ఉందని కామెంట్లు కూడా చేశారు. ఇక ఈ సినిమా కూడా   మే నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. అయితే మహేష్ నటించిన మహర్షి సినిమా మాత్రం మే నెల 9వ తేదీన విడుదలై అనుకున్న విధంగానే మంచి విజయాన్ని సాధించింది.అయితే  ఈ సక్సెస్ సెంటిమెంట్ వల్లే సర్కారు వారి పాట మేకర్స్ ఈ సినిమాను మేలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది..ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: