ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే .. రామ్-జానులు(విజయ్ సేతుపతి-సమంత) తన స్కూల్ వయసులో ప్రేమికులగా ఉండి.. 22 ఏళ్ల తర్వాత అనుకోకుండా విడిపోయినప్పుడు.. తమ క్లాస్ మేట్స్ తో కలిసి ఒకరినొకరు కలుసుకోవడం వంటి కథాంశంతో ఈ సినిమా స్టోరీ తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను,అభిమానులను సైతం హృదయాలను ఆకట్టుకునేలా చేసింది. ఈ సినిమా చూసిన చాలా మంది తమ స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్ ని కలుసుకోవడం వంటిది జరుగుతూ ఉన్నాయి. అందుచేతనే ఈ సినిమా అగ్రస్థానంలో ఉన్నది. ముఖ్యంగా యావత్ యువతని బాగా ఆకట్టుకుంది కనుక..ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.
అయితే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీయాలని అభిమానులు కోరడం తో ఈ విషయంపై డైరెక్టర్ స్పందించడం జరిగింది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ర్ ఈ సినిమా సీక్వెల్ కు కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలియజేశాడు. అందుకోసమే విజయ్ సేతుపతి తో కూడా చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా కోసం త్రిష విజయ్ సేతుపతి మరొకసారి నటించబోతున్నారని అభిమానులు అడుగుతున్నారు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక అధికార ప్రకటన రానుంది.