నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఈ సినిమాకు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది, అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ కూడా ఈ సినిమాలో నటించింది. ఇది ఇలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి, ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహా సన్ హీరోయిన్ గా నటించనుంది, ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కన్నడ హీరో దునియా విజయ్ కనిపించబోతున్నాడు, అలాగే మరో కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో కనిపించబోతోంది, ఈ సినిమాలు దర్శకుడు గోపీచంద్ మలినేని ఫ్యామిలీ ప్లస్ మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, అలాగే బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, ఒక పాత్రలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్టు గా కనిపించనుండగా, మరొక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

 ఇది ఇలా ఉంటే బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో  నటించబోతున్నాడు,  అలాగే వీటితో పాటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కూడా బాలకృష్ణ నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి, అయితే ఈ సినిమాలతో పాటు పరశురామ్ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ నటించబోతున్నట్లు తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇలా బాలకృష్ణ వరసపెట్టి క్రేజీ డైరెక్టర్ లతో సినిమాలను ఓకే చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: