చిత్ర పరిశ్రమలోకి చాలా మంది నటులు, దర్శకులు, సినీ నిర్మాతలు వస్తుంటారు. వారి అదృష్టాన్ని పరీక్షించుకొని మళ్లీ తిరిగి వెళ్తుంటారు. ఇండస్ట్రీలో అలా అడుగుపెట్టిన దర్శకులలో మొదటి సినిమాతోనే హిట్ అయిన వారు ఉన్నారు. కాలం కలిసిరాక ఇండస్ట్రీని నుండి వెనుదిరిగి వెళ్లిన వారు ఉన్నారు. మరికొంత మంది సినిమా సినిమాకి కొంత విరామం ఇస్తూ ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘కొత్తబంగారు లోకం’ సినిమాతో సకెస్స్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తరువాత  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలతో సెన్సిబుల్ డైరక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్‌తో నారప్ప అంటూ అసురన్ రీమేక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే శ్రీకాంత్ అడ్డాల కేవలం క్లాస్ సినిమాలే తీయగలడన్న దానికి నారప్ప గట్టి ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక నారప్ప తర్వాత తన నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల తన తర్వాతి సినిమా నందమూరి బాలకృష్ణతో సెట్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ మధ్య బాలయ్య వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే గోపీచంద్ మలినేని సినిమా సెట్స్ మీద ఉండగా మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై శ్రీకాంత్ అడ్డాల సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. శ్రీకాంత్ అడ్డాల బాలకృష్ణతో ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది ఆసక్తి రేపుతోంది.

ఇక బాలయ్య లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో శ్రీకాంత్ అడ్డాల వస్తే మాత్రం మళ్లీ ఓ సూపర్ హిట్ సినిమా బాలయ్య ఖాతాలో పడినట్టే అని సినీ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు శ్రీకాంత్ అడ్డాల మాత్రమే కాదు బాలయ్యతో సినిమా కోసం అనిల్ రావిపుడి, పూరీ జగన్నాథ్ లైన్‌లో ఉన్నారు. గోపీచంద్ మలినేని సినిమా పూర్తి చేయడమే ఆలస్యం. దీంతో బాలయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమాను ఓకే చెప్పాలంటు ఫిక్స్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: