నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా కార్తికేయ. 2014లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమా సీక్వెల్ గా కార్తికేయ 2 చేస్తున్నారు. కార్తికేయ 2 కూడా అంచనాలకు తగినట్టుగా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. సెట్స్ మీద ఉన్న కార్తికేయ 2 సినిమా బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇంకా అవలేదు కానీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.

జీ స్టూడియోస్ వారు కార్తికేయ 2 అన్ని భాషల రైట్స్ కొనేశారట. ఈ సినిమాకు సంబందించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ జీ సొంతమైనట్టు తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ రైట్స్ కోసం 16.5 కోట్లు ఇచ్చారట. ఈమధ్య తెలుగు సినిమాల మీద జీ స్టూడియోస్ ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తుంది. కార్తికేయ 2 సినిమాని కూడా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ రెండు జీ స్టూడియోస్ సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ కార్తికేయ హిట్ కాగా ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

కార్తికేయ 2లో నిఖిల్ తో మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమాతో పాటుగా నిఖిల్ 18 పేజెస్ సినిమా కూడా చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ లో గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ సినిమాలో కూడా అనుపమ తో నిఖిల్ రొమాన్స్ చేస్తున్నాడు. రాబోయే ఈ రెండు సినిమాలతో నిఖిల్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అర్జున్ సురవరం తర్వాత నిఖిల్ చేయడానికి 3 సినిమాలు చేశాడు కానీ కరోనా వల్ల ఏ ఒక్కటి రిలీజ్ కాలేదు. అందుకే మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు నిఖిల్ టీం. 18 పేజెస్ సినిమా ఈ నెల చివర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: